షాకింగ్: జ్యోతిలక్ష్మి ఇక లేరు
on Aug 9, 2016
ఐటెమ్ పాటలతో హోరెత్తించిన ఒకప్పటి శృంగార తార.. జ్యోతిలక్ష్మి ఇక లేరు. ఈరోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఐటెమ్ పాటలకూ, వ్యాంపు పాత్రలకూ జ్యోతిలక్ష్మి ప్రసిద్ది. అలానే దాదాపుగా 300 చిత్రాల్లో నటించారు. అప్పట్లో కమర్షియల్ సినిమా అంటే జ్యోతిలక్ష్మి పాట ఉండాల్సిందే. అది ఎన్టీఆర్ సినిమా అయినా.. ఏఎన్నార్ సినిమా అయినా. తెలుగు మాత్రమే కాదు... పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారామె. లేలేలే.. నా రాజా, జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. పాటలు ఎవర్ గ్రీన్ హిట్ పాటలుగా నిలిచాయి. ఇప్పటి ఐటెమ్ గీతాలకూ కిక్ ఇచ్చే పాటలవి. దొంగరాముడు అండ్ పార్టీ, బంగారుబాబు ఆమె నటించిన ఆఖరి తెలుగు చిత్రాలు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలోని కన్నమ్మ పేటలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్యోతిలక్ష్మి మృతికి తెలుగు చిత్రసీమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.