ఈ లైనప్తో ఎన్టీఆర్ని కొట్టేవాళ్ళు ఉండరు
on Jun 3, 2017
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు. క్లాస్, మాస్, ఫామిలీస్, ఇలా ఏ ఒక్క వర్గాన్నో టార్గెట్ చేయకుండా, అందరినీ అలరించేలా సినిమాలు చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ లాంటి హిట్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీకి సినిమా ఇవ్వడం ఏంటని ఫాన్స్ తో సహా అందరూ వాపోయారు. కానీ, ఆహ్లాదకరంగా ఉన్న జై లవ కుశ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే అందరి ఒపీనియన్ మారి, సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది.
ఇంతలో, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనగానే, ఇంటరెస్ట్ ఇంకొంచెం పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, జై లవ కుశ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక ప్రత్యేక సినిమాగా నిలుస్తుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని తెలిసింది. జై లవ కుశ కంప్లీట్ అవ్వగానే, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టనున్నాడు. ఇది కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు.
ఎప్పుడూ యూత్, ఫామిలీస్ టార్గెట్ చేసుకుని సినిమాలు తీసే త్రివిక్రమ్, ఈ సారి తన పంథా మర్చి సరికొత్త జోనర్ ఎన్నుకున్నాడని అంటున్నారు. వరుస హిట్లు ఇస్తున్న త్రివిక్రమ్ సినిమాలు మినిమం గారంటీగా ఉంటాయి. అలాంటిది, ఆయన పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్టు ఎన్నుకున్నాడంటే, ఎన్టీఆర్ ఫాన్స్ ఇంటరెస్ట్ ని పరిగణలోకి తీసుకున్నాడన్నమాట. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. ఈ సినిమా కూడా పూర్తవ్వగానే, ఎన్టీఆర్ రాజమౌళితో ఒక సినిమా చేయొచ్చని అంటున్నారు. గతంలో తమ కాంబినేషన్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్, రాజమౌళి ఈసారి వచ్చే సినిమా ఇద్దరి క్రేజ్ కలిపి అంతకు మించి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనక జరిగితే, ఈ లైనప్ తో ఎన్టీఆర్ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతాడనడంలో అతిశయోక్తి లేదు.
Also Read