యుద్దానికి సిద్ధం అంటున్నపవన్ కళ్యాణ్
on Apr 22, 2017
పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ పెట్టి చాలా రోజులవుతుంది. కొన్ని కారణాల దృష్ట్యా 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీడీపీ-బీజేపీ లకి సపోర్ట్ చేసాడు. కానీ, రెండు పార్టీ లు ప్రత్యేక హోదా, వేరే ఇతర విషయాల్లో మాట మార్చడంతో, పవన్ రెండు పార్టీలని వ్యతిరేకించడం మొదలెట్టాడు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేద్దాం అనుకున్న సమయంలో అధికార పార్టీ మొగ్గలోనే దాన్ని తుంచేసింది. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఏదో రకంగా రాష్ట్ర, దేశ అధికార పార్టీల పైన వీలుచిక్కినప్పుడల్లా తన ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. పవన్ సోషల్ మీడియా లో పెట్టే స్టేట్మెంట్ లు సమర్ధనీయంగా ఉన్నప్పటికీ, అది సరైన ప్లాట్ఫామ్ కాదనేది కొందరి అభిప్రాయం. పవన్ కేవలం ట్వీట్స్ యే వేస్తాడా, లేక జనాల్లోకి వచ్చేది ఏమైనా ఉందా అని అనేవాళ్లూ ఉన్నారు.
ఇంకొందరు అయితే, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ లకి మద్దతు ఇస్తాడు అని అభిప్రాయపడుతున్నారు. వీళ్ళందరికీ, పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానం ఇస్తున్నారు. జన సేన యువతకి పెద్ద పీట వేస్తూ, కులాలు మతాలకతీతంగా ఎవరయితే సమర్థులో వాళ్ళకే ముఖ్యమయిన పోస్ట్ లు ఇచ్చే యోచనలో ఉంది. పార్టీ లో చేరికలు భారీగానే జరుగుతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ట్వీట్ చూస్తే జన సేన ఇప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. "ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే," అని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే, ముందస్తు ఎన్నికలు అని పవన్ చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటి? క్యాబినెట్ విస్తరణ తర్వాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఒకవేళ ఏదైనా జరిగి, ముందస్తు ఎన్నికలు వస్తే, కొందరు జన సేన లో చేరే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ వీళ్ళని తీసుకుంటాడా లేక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడా? చూద్దాం ఏం నిర్ణయం తీసుకుంటాడో.