'జై భీమ్'కు అరుదైన గౌరవం
on Jan 18, 2022
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధానపాత్రలో నటించిన సినిమా 'జై భీమ్'. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 'జై భీమ్' సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ అయినటువంటి అకాడమీ(ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ‘జై భీమ్’కి సంబంధించిన సీన్స్ ని అప్లోడ్ చేశారు. జైలు వద్ద దొంగలను కులాల వారిగా విభజించి జైలుకు తరలిస్తున్న సీన్, సినతల్లి భర్తను దొంగగా ముద్రవేసి అరెస్ట్ చేయడం, లాయర్ గా సూర్య వాదించడం వంటివి కలిపి మొత్తం 12 నిమిషాల నిడివి గల వీడియోని ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ఉంచారు.
ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన మొదటి తమిళ్ సినిమా 'జై భీమ్' కావడం విశేషం. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read