ఫిదా టీజర్ రివ్యూ
on Jun 17, 2017
మెగా హీరో వరుణ్ తేజ్, ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా మూవీ టీజర్ ఇంతకు ముందే విడుదలయింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మార్క్ రొమాంటిక్ క్లాస్ ఎంటర్టైనర్ గా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ టీజర్. ఎన్నారై పాత్రలో వరుణ్ తేజ్ క్లాస్ లుక్ లో కనిపించగా, తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి అలరించింది. టీజర్ లో మొదట వచ్చే డైలాగ్ తో సాయి పల్లవి క్యారెక్టర్ ఏంటో బేరీజు వేయొచ్చు. రన్నింగ్ ట్రైన్లో డోర్ పక్కన నిలబడి ఎవరికో వార్నింగ్ ఇస్తూ, 'బద్మాష్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా..." అని టిపికల్ తెలంగాణ స్లాంగ్ లో చెబుతుంది. వెంటనే, వరుణ్ తేజ్ క్లాస్ ఎంట్రీ... 'ఏం పిల్లరా... ఎల్లట్లేదు మైండ్ లో నుంచి... జీవితాంతం ఎవరితోనో ఉండాలనుకుంటాం కదా... అది ఈమే...' అనే డైలాగ్ తో. తర్వాత ఒక అందమైన లొకేషన్లో వరుణ్ తేజ్, తన సఖి పల్లవి ని గట్టిగా హత్తుకోవడంతో టీజర్ ముగుస్తుంది. ట్రైలర్ ని ఈ నెల 23 న విడుదల చేయనున్నట్టు చూచాయగా చెప్పడం జరిగింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి బాగున్నారు. మొత్తానికి, టీజర్ అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. హిట్ ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. విజయ్ కుమార్ కెమెరా పనితనం, శక్తి కాంత్ నేపథ్య సంగీతం, శేఖర్ కమ్ముల ట్రీట్మెంట్ టీజర్ లో హైలైట్స్.