పూరి-ఛార్మి `డబుల్ ఇస్మార్ట్` !!!
on Feb 26, 2019
పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంకర్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈసినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఒక పక్క ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుండగానే...ఈ సినిమా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్, ఛార్మి. ఈ సీక్వెల్ కి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ని కూడా ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వ రకు ఆగాల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభానటేష్ ను హీరోయిన్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రామ్ ఇందులో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడే ఫుల్ మాస్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఈ సారైన సక్సెస్ కొట్టి పూరి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీ స్ పతాకంపై పూరి, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. మేలో రిలజ్ కు ప్లాన్ చేస్తున్నారు.