` సాహో` రైట్స్ దక్కించుకున్న హిట్ చిత్రాల నిర్మాత!!
on Jun 8, 2019

ప్రభాస్ హీరోగా `బాహుబలి` తర్వాత హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం `సాహో`. ఈ సినిమా ఆగస్ట్ 15న భారీగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చివరి షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇక తాజాగా నైజాం రైట్స్ కు సంబంధించి ఒక న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వినబడుతోంది. నైజాం అండ్ వైజాగ్ రైట్స్ ను దిల్ రాజు భారీ మొత్తానికి దక్కించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ రైట్స్ కోసం 45 నుంచి 50 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా దిల్ రాజు కానీ, యువి క్రియేషన్స్ నిర్మాతలు కానీ ప్రకటించలేదు. సుజిత్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ఆర్ ఆర్ విషయానికి వస్తే తమన్ చేసే అవకాశాలున్నాయట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



