నూడిల్స్ తిని బతికే వాళ్ళం..మిస్ ఇండియా పోటీల రహస్యం ఇదే
on Mar 12, 2025
.webp)
నాగార్జున(Nagarjuna)నుంచి వచ్చిన అనేక సినిమాల్లో'వైల్డ్ డాగ్' కూడా ఒకటి. అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ హీరోయిన్ 'దియామీర్జా'(Dia Mirza)నాగార్జున వైఫ్ ప్రియా వర్మ క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించింది.2001 నుంచే బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తు వస్తున్న 'దియామీర్జా 'అందాల పోటీలకి సంబంధించి 2000 మిస్ ఆసియా ఫసిఫిక్ ఇంటర్నేషనల్, 2000 ఫెమినా మిస్ ఇండియా కూడా నిలిచింది.అదే సంవత్సరం జరిగిన మిస్ ఇండియా పోటీల్లో మాత్రం సెకండ్ రన్నరప్ గా నిల్చింది.
రీసెంట్ గా దియా మీర్జా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 2000 వ సంవత్సరంలో నేను,ప్రియాంక చోప్రా(Priyanka Chopra),లారాదత్త(Lara Dutta)మిస్ ఇండియాలో పాల్గొన్నాం.ప్రియాంక కి వాళ్ళ ఇంట్లో నుంచి ఎంతో సపోర్ట్ ఉండేది,కానీ నాకు లారాదత్త కి ఉండేది కాదు, అప్పటికే లారా దత్త మోడలింగ్ లో రాణిస్తున్న కారణంగా ముంబై లోని ఒక ఇరుకు ఇంట్లో అద్దెకి ఉండేది.నేను ముంబై వచ్చినప్పుడు నాకు ఎంతో సహాయం చేయడమే కాకుండా తన రూమ్ లో ఉంటానికి కూడా లారా అవకాశం కలిపించింది. ఫ్యాషన్ షో లో పాల్గొంటూ ఖరీదైన దుస్తులు ధరిస్తు ఉండేవాళ్ళం.కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. ఒక్కోసారి నూడిల్స్ తిని ఆకలి తీర్చుకునేవాళ్ళం.
కాస్ట్ లీ దుస్తులు వేసుకున్నా కూడా నూడిల్స్ తింటున్నాం అని నవ్వుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ గా నిలిచాయి.2000 మిస్ ఇండియా పోటీల్లో
లారాదత్త విజేతగా నిలవగా, ఫస్ట్ రన్నర్ గా ప్రియాంక చోప్రా నిలిచింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



