డీజే విషయంలో దిల్ రాజు ఇలా ఎందుకు చేశాడు??
on Jun 21, 2017
దిల్ రాజు గొప్ప మేధావి. మార్కెట్ సూత్రాలు ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలీవేమో. ఏదైనా ఓ సినిమాలో విషయం ఉందని తెలిస్తే... చప్పున వాలిపోతాడు. ఆ సినిమాని ఎంతైనా సరే, కొని తీరతాడు. దిల్ రాజు ఓ సినిమా కొన్నాడంటే.. కచ్చితంగా అది హిట్టే అని నమ్ముతుంది సినీ లోకం. తన సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకోవడం దిల్ రాజుకి అలవాటు. అయితే... డీజే విషయంలో దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు. దిల్ రాజు సంస్థ నుంచి వస్తున్న 25వ చిత్రమిది. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. అయితే.. దిల్ రాజు మాత్రం ఈ సినిమాని ఎప్పుడో అమ్మేశాడు. నైజాం, విశాఖ మాత్రం తన చేతుల్లో ఉంచుకొన్నాడు.
ఈ సినిమాపై దిల్ రాజుకి అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు అమ్ముకోవాల్సివచ్చింది. నైజాం కూడా అమ్మేయాల్సిందే. ఇక్కడ తన చేతిలో థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు సొంతంగా విడుదల చేసుకోవడమే బెటర్. అందుకే.... ఈ సినిమాని నైజాంలో తనకు తాను విడుదల చేస్తున్నాడు. వ్యవహారం చూస్తుంటే... డీజేపై దిల్ రాజుకి నమ్మకాలు సన్నగిల్లి ఉంటాయని, అందుకే ఈ సినిమాని అమ్ముకొని... సేఫ్ అయిపోయాడని ఇండ్రస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవునో కాదో తెలియాలంటే డీజే రిపోర్ట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
Also Read