`కేరాఫ్ సక్సెస్`.. ఈ కథానాయికలు!
on Jan 21, 2022
ప్రస్తుతం తెలుగునాట కొంతమంది కథానాయికలు వరుస విజయాలతో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ భామలెవరంటే..
పూజా హెగ్డేః కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలు చూసిన పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్. `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. ఇలా ఇప్పుడు మిస్ హెగ్డే ఖాతాలో తెలుగునాట ఐదు వరుస విజయాలున్నాయి.
కృతి శెట్టిః గత ఏడాది సంచలనాల్లో ఒకటైన `ఉప్పెన`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ఆపై అదే సంవత్సరం చివరలో రిలీజైన `శ్యామ్ సింగ రాయ్`తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సంక్రాంతికి సందడి చేసిన `బంగార్రాజు`తో హ్యాట్రిక్ హీరోయిన్ అయిపోయింది.
రష్మికా మందన్నః కెరీర్ ఆరంభంలో తెలుగునాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన రష్మికా మందన్న.. మధ్యలో కాస్త జోరు తగ్గించినా, ఈ మధ్య మళ్ళీ వరుస విజయాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రైజ్` చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది.
సాయిపల్లవిః టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సాయిపల్లవి.. మధ్యలో కాస్త ట్రాక్ తప్పినా గత ఏడాది `లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాలతో మళ్ళీ వరుస విజయాలు చూసింది.
శ్రుతి హాసన్ః ఒక దశలో వరుస విజయాలతో టాలీవుడ్ ని విశేషంగా ఆకర్షించిన శ్రుతి హాసన్.. ఆ మధ్య కొంతకాలం రేసులో వెనుకబడింది. అయితే, నిరుడు `క్రాక్`, `వకీల్ సాబ్`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మరోసారి సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినట్లయ్యింది.
ఫరియా అబ్దుల్లాః గత ఏడాది `జాతిరత్నాలు`తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా.. ఆపై `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`, `బంగార్రాజు`లో స్పెషల్ అప్పీయరెన్స్ తోనూ విజయాలు చూసింది.
మరి.. రాబోయే సినిమాలతోనూ ఈ ముద్దుగుమ్మలు విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.