తమిళనాడు ప్రభుత్వానికి నిర్మాతల విజ్ఞప్తి...
on Aug 14, 2020
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో రాష్ట్రంలో సినిమా చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చింది. కర్ణాటక సైతం తమ రాష్ట్రంలో టీవీ, సినిమా చిత్రీకరణలకు పచ్చజెండా ఊపింది. తమిళనాడులో మాత్రం ఇంకా సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు అందరూ కలిసి తమిళ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు.
ఇండోర్ సెట్స్, స్టూడియోలలో చిత్రీకరణకు అనుమతులు ఇవ్వవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని అక్కడి నిర్మాతలు కోరారు. తమిళ్ ఫిలిం యాక్టర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ భారతీరాజా నిర్మాతల తరఫున ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలో సీరియల్ షూటింగులకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరికి కరోనా సోకడంతో కాస్త ఆందోళనకర పరిస్థితి నెలకొంది. చెన్నైలోనూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొంతమంది షూటింగులు చేయడానికి వెనుకంజ వేశారు. మరికొందరు చేస్తున్నారు.
Also Read