సెకండాఫ్ లో అక్కినేని వారి హవా!
on Jan 24, 2022
అక్కినేని కాంపౌండ్ లో ప్రస్తుతం విజయాలే విజయాలు. `మజిలీ`, `లవ్ స్టోరి`, `వెంకిమామ`, `బంగార్రాజు`తో యువ సామ్రాట్ నాగచైతన్య వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంటే.. రీసెంట్ గా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో హీరోగా ఫస్ట్ సక్సెస్ చూశాడు అఖిల్. ఇక `సోగ్గాడే చిన్ని నాయనా` విడుదలైన ఆరేళ్ళకి `బంగార్రాజు`తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు కింగ్ అక్కినేని నాగార్జున. మొత్తంగా.. అక్కినేని తండ్రీతనయులు నాగ్, చైతూ - అఖిల్ విజయాల బాటలో పయనిస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు.
Also Read: ఓటీటీలోనూ 'అఖండ' జాతర
ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సోలో హీరోలుగా తెలుగునాట తమ తదుపరి చిత్రాలతో సందడి చేయనున్నారు. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ `ద ఘోస్ట్`తో ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో నాగ్ ఎంటర్టైన్ చేయనుండగా.. `మనం` అనంతరం విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో చేస్తున్న `థాంక్ యూ`తో ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నాడు చైతూ. ఇక స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో `ఏజెంట్`గా సందడి చేయబోతున్నాడు అఖిల్. మరి.. సెకండాఫ్ లో హవా చాటనున్న అక్కినేని కాంపౌండ్ స్టార్స్.. ఈ సారి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also Read: బాబాయ్ లక్కీ డేట్.. అబ్బాయ్ కీ ప్లస్సయ్యేనా!
కాగా, ఇదే ఏడాది చైతూ ఓ ముఖ్య పాత్రలో నటించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా`, నాగ్ ఓ కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ప్రాజెక్ట్ `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ః శివ` కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 14న `లాల్ సింగ్ చద్ధా` తెరపైకి రానుండగా.. సెప్టెంబర్ 9న `బ్రహ్మాస్త పార్ట్ వన్ః శివ` విడుదల కానుంది.
Also Read