ENGLISH | TELUGU  

ప్రధానిని కలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్

on Jun 23, 2014

 

Aamir Khan and Modi


ఎన్నికల ముందు ఓట్ కాంపేన్ తో పాటు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న అనేక సామాజిక అంశాలను తీసుకుని వినూత్నంగా రూపొందిచిన 'సత్యమేవ జయతే'  కార్యక్రమం గురించి చర్చించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలుసుకున్నారు.  'సత్యమేవ జయతే' కార్యక్రమానికి వ్యాఖ్యతగా అమీర్ ఖాన్ వ్యవహరించిన సంగతి విధితమే. ఈ కార్యక్రమంలో చూపించిన అంశాలను తప్పకుండా పరిశీలస్తామని ప్రధాని మోడి మాట ఇచ్చినట్లు అమీర్‌ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రధాని తన విలువైన సమయాన్ని తన కోసం కేటాయించినందుకు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.

సౌత్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశాన్ని  కర్టసీ కాల్ గా ప్రధాని కార్యాలయం ఉదహరించింది. ప్రధాని అధికారిక వెబ్‌సైట్ ఈ ఫోటోలను విడుదల చేసింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.