నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి..ఎందుకు తొందర పడుతున్నావు
on Apr 30, 2024
2013 లో వచ్చిన పట్టం పోలె అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నటి మాళవిక మోహనన్. అందులో దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటించి మంచి పేరు సంపాదించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె యు మోహనన్ ఆమె తండ్రి. లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ రాజా సాబ్ లో హీరోయిన్ గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ తో కలిసి ఒక సాంగ్ షూట్ లో కూడా పాల్గొనబోతుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు.తాజాగా ఆస్క్ మాళవిక పేరిట ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఒక అభిమాని వేసిన ప్రశ్నకి మాత్రం తనదైన రీతిలో జవాబు ఇచ్చింది. గ్లామర్ షో కి బదులు నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు అని అడిగాడు. నేను చెయ్యను నీకేమైనా ఇబ్బందా అని ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఇంకో అభిమాని పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వేసాడు. నా పెళ్లి చూసేందుకు నువ్వెందుకు తొందర పడుతున్నావ్ అని జవాబు ఇచ్చింది.ఈ రెండు విషయాలు చాలు తను ఎంత స్పెషలో చెప్పడానికి
మాళవిక కి లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ జోన్ లలో నటించడం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తనే చాలా ఇంటర్వూస్ లో చెప్పింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ పేట, ఇళయ దళపతి విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ లలో నటించింది.ఇవి తెలుగులో కూడా విడుదల అయ్యాయి. ప్రస్తుతం విక్రమ్ తంగలాన్ లో చేస్తుంది.మొదటి సారి డి గ్లామరైజ్డ్ పాత్రలో మెరిసింది. తన పాత్రకి తొలిసారి తనే డబ్బింగ్ చెప్పుకుంది. అతి త్వరలోనే తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది
Also Read