గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం... టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా
on May 10, 2024
రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ అందరికీ తెలుసు. స్ట్రీట్ ఫుడ్ వెండర్ గా ఆమె అందరికీ పరిచయమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఫేవర్ చేశారు. అలాంటి కుమారి ఆంటీ చుట్టూ సీరియల్స్ అని బిగ్ బాస్ షోస్ అనే టాక్స్ కొంతకాలం క్రితం వరకు నడిచాయి. ఆమె స్వస్థలం గుడివాడ..అలాంటి ఈమె ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గుడివాడపై ప్రేమతో ఇక్కడికి వచ్చానని చెప్పింది. కూటమి తరపున గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ మద్దతు తెలిపారు.
ఆయన కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు. వెనిగండ్ల రాము ఎవరో కాదు మహర్షి మూవీలో మహేష్ బాబు లాంటి వ్యక్తి అని కితాబిచ్చారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది కుమారి ఆంటీ. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు.
Also Read