నీహారిక కొణిదెల, జయప్రకాశ్ నారాయణ ల గొర్రె ఇదే
on May 8, 2024
నీహారిక కొణిదెల.. మెగా డాటర్ అనే గుర్తింపుతో సినిమాల్లో రాణిస్తూ మంచి నటి అనే పేరు సంపాదించింది. ఇప్పుడు నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు అనే సామాజిక స్పృహతో కూడిన సినిమాని నిర్మిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అందులోని ఒక పాటని ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాష్ నారాయణ విడుదల చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది
మనిషివా గొర్రెవా అనే లిరిక్ తో పాట స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత రోడ్లన్నీ గతుకులు పాలే.. ఊరంతా చీకటి పాలే.. రేషన్లు పింఛన్లన్నీ గల్లంతాయే అనే పల్లవి తో సాగింది. ఎలక్షన్లలో ఓటు అమ్ముకోవద్దనే ఒక మంచి మెసేజ్ ని చెప్తుంది. ఇప్పుడు ఈ పాటనే జయప్రకాశ్ నారాయణ విడుదల చేసాడు.అనంతరం అయన మాట్లాడుతు గొర్రెవా పాట అందరిలో ఆలోచన కలిగించే విధంగా ఉందని చెప్పాడు. దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. ఓటు వేసే విషయంలో మార్పు కూడా రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కూడా తెలిపాడు
ఆ తర్వాత నీహారిక కూడా పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. జయప్రకాశ్ సర్ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టాడు. అలాంటిది ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. యదు వంశీ దర్శకుడు కాగా సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, గోపరాజు రమణ, ఈశ్వర్,శ్రీనాధ్,శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. నిహారిక తల్లి పద్మజ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది
Also Read