బాబాయ్ కోసం అబ్బాయ్ ఎన్నికల ప్రచారం!
on Apr 26, 2024
మే 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఈ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బరిలో నిలిచారు. నామినేషన్ ర్యాలీతోనే పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామనే సంకేతాన్ని ఇచ్చారు పవన్ . అయినప్పటికీ రిలాక్స్ అవకుండా, ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. అంతేకాదు పవన్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు.
తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో రేపు(శనివారం) వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నాడు. వరుణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటి మిగతా మెగా హీరోలు కూడా ప్రచారానికి వచ్చే అవకాశముంది. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కూడా ప్రచారం చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అయితే తమ్ముడికి మద్దతుగా చిరంజీవి వీడియో సందేశం ఇచ్చే అవకాశముందని, అలాగే తన బాబాయ్ కోసం రామ్ చరణ్ ఒకసారి పిఠాపురంలో పర్యటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగితే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డు మెజారిటీతో గెలుస్తారు అనడంలో సందేహం లేదు.
Also Read