సంపత్ నంది దర్శకత్వంలో 'విక్రమార్కుడు 2'.!
on Sep 21, 2021
దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'విక్రమార్కుడు'. రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా 2006లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని.. ఈ సీక్వెల్ కు సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల విక్రమార్కుడు సీక్వెల్ కథ రెడీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో 'విక్రమార్కుడు 2' గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించే ఛాన్స్ లేకపోవడంతో.. విక్రమార్కుడు సీక్వెల్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా 'విక్రమార్కుడు 2' డైరెక్టర్ సంపత్ నంది చేతికి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
సంపత్ నంది కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. రీసెంట్ గా గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీటీమార్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఆయన గతంలో రవితేజతో 'బెంగాల్ టైగర్' సినిమా చేసి మెప్పించారు. ఇక ఇప్పుడు 'విక్రమార్కుడు 2'తో మరోసారి ఆయన రవితేజను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారని అంటున్నారు.
Also Read