తారక్ బాటలో చరణ్.. 'RC15'లో ట్రిపుల్ రోల్!
on May 24, 2022
ఈ జనరేషన్ టాలీవుడ్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసి అలరించాడు. 'జై లవ కుశ' సినిమాలో జై(రావణ్)గా, లవుడుగా, కుశుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ్ పాత్రలో అదరగొట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న తారక్, చరణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. తారక్ త్వరలో కొరటాల శివ సినిమాతో బిజీ కానుండగా.. చరణ్ ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సెట్స్ నుంచి చరణ్ ఫోటోలు కొన్ని లీకై ఆకట్టుకున్నాయి. చరణ్ లుక్ ఒక్కో ఫోటోలో ఒకోలా ఉండటంతో చరణ్ రోల్ గురించి ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోచరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
'RC15'లో చరణ్.. తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకుల పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కొడుకు పాత్ర తండ్రి ఆశయాల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి కాగా.. మరో కొడుకు పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. అంటే ఈ సినిమాలో హీరో, విలన్ రెండూ చరణే అన్నమాట. చరణ్ ట్రిపుల్ రోల్ న్యూస్ నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. కాగా చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో 'ముగ్గురు మొనగాళ్ళు' సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి మెప్పించారు.