ఆ ప్రాజెక్ట్ వెనక్కి.. పూరి ప్రాజెక్ట్ ముందుకి!!
on Jul 24, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. అయితే ఈ మూవీ అనంతరం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉంటుంది అనుకుంటుండగా.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ వచ్చిందని అంటున్నారు.
బోయపాటి, గోపి చంద్ ల ప్రాజెక్ట్స్ తరువాత అనిల్ రావిపూడితో మూవీ చేయాలని బాలయ్య భావించారు. అయితే అనిల్ చెప్పిన స్క్రిప్ట్ లో బాలయ్య కొన్ని మార్పులు చెప్పారట. దీంతో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయడం కోసం అనిల్ కొంత సమయం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్ లో పూరి ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. పూరి చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తాడనే పేరుంది. అందుకే బాలయ్య పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.
గతంలో పూరి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ రానుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనిల్ ప్రాజెక్ట్ కంటే ముందుగా పట్టాలెక్కనుందని న్యూస్ విపిస్తోంది.