ENGLISH | TELUGU  
Home  » Gossips

ఇలా చేసుకుంటూ పోతే, జనసేన ని పట్టించుకునేదెవరు?

on Nov 29, 2017


పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ స్థాపించి ఏళ్ళవుతుంది. పోయిన ఎలక్షన్స్ లోనే పోటీకి దిగుతాడు అనుకుంటే బీజేపీ, టీడీపీ కి స్నేహ హస్తం ఇచ్చి, తద్వారా అభిమానులకి నిరాశ మిగిల్చాడు. ఇక ఈ సారి అయినా పూర్తి స్థాయిలో దిగుతాడు అనుకుంటే, కొన్ని నియోజక వర్గాల్లోనే తమ అభ్యర్థుల్ని నిలబెడతానని ప్రకటించారు. అది సరే, సమయం పెద్దగా లేదు కదా మరి ఇంకెప్పుడు జన సేన ద్వారా జనాల్లోకి వస్తాడు అని అనుకుంటున్న తరుణంలో... పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఈ విషయం ఒక వర్గానికి సంతోషాన్నివ్వగా, మరో వర్గానికి అసంతృప్తి కలిగించింది.

సర్దార్ గబ్బర్ సింగ్ చేసే సమయంలో తాను మరో రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ కి గుడ్ బయ్ చెబుతానని అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి విడుదలవనున్న ఈ సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాయే

పవన్ కి చివరి చిత్రం అనుకున్నారు అందరు. కానీ, తమిళ దర్శకుడు ఆర్ టీ నీసన్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. ఏ ఎం రత్నం నిర్మించనున్న ఈ సినిమా తమిళ్ మూవీ వేదలమ్ కి రీమేక్. ఈ విషయం స్వతహాగా ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తన దర్శకత్వంలో వస్తున్న ఆక్సిజన్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియా మిత్రులతో పంచుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కి ఎంత కాదన్న ఒక సంవత్సర కాలం పడుతుంది. అంటే 2018 చివరో, లేదంటే 2019 మొదలు అవ్వొచ్చు.

మరి, జనరల్ ఎలక్షన్స్ 2019 లో రానున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ జన సేన గురించి పట్టించుకునేదెప్పుడు. అసలు, పవన్ కళ్యాణ్ స్ట్రాటెజీ ఏంటో అర్ధం కాక పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. చూద్దాం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.