ENGLISH | TELUGU  
Home  » Gossips

అప్పుడే ఓటీటీలోకి గుంటూరు కారం!

on Jan 21, 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

'గుంటూరు కారం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనునందట. ఫిబ్రవరి 9 నుంచి 'గుంటూరు కారం' మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.