బాలయ్యతో గోపీచంద్ `రౌడీయిజం`?
on Sep 13, 2021
`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కెప్టెన్ నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. అక్టోబర్ తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుందని సమాచారం. ఓ భారీ పోరాట ఘట్టంతో తొలి షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని బజ్.
ఇదిలా ఉంటే.. బాలయ్య - గోపీచంద్ ఫస్ట్ కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాకి `రౌడీయిజం` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. అంతేకాదు.. కథానాయికగా త్రిష లేదా ఇలియానా నటించే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే టైటిల్, హీరోయిన్ వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. బాలయ్యతో గోపీచంద్ చేయించనున్న ఈ `రౌడీయిజం`.. బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.
కాగా, ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నారు. అలాగే, `క్రాక్`లో జయమ్మగా అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఇందులోనూ ఓ పవర్ ఫుల్ రోల్ ని డిజైన్ చేశారట గోపీచంద్.