తారక్ షోలో రూ.25 లక్షలు గెలుచుకున్న చరణ్!!
on Jul 29, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరవుతాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఇప్పటికే షూట్ కూడా చేశారని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో తారక్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ని షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తారక్ హోస్ట్ చేస్తున్న షో ఫస్ట్ ఎపిసోడ్ కి చరణ్ గెస్ట్ గా వస్తే.. షోకి కూడా మంచి హైప్ వస్తుందని భావించిన నిర్వాహకులు ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఇప్పటికే షూట్ చేశారని.. ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారని సమాచారం. అంతేకాదు గెస్ట్ గా వచ్చిన చరణ్.. తారక్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడని టాక్.
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి సంబంధించి ఇప్పటికే 16 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారట. చరణ్ తో షూట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్ ని ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారట. ఆ తర్వాత సాధారణ కంటెస్టెంట్స్ పాల్గొన్న ఎపిసోడ్స్ ను ప్రసారం చేయనున్నారని సమాచారం.
Also Read