వరుస నెలల్లో విక్రమ్ - రెహమాన్ కాంబో సందడి!
on Jun 18, 2022
`చియాన్` విక్రమ్ కథానాయకుడిగా నటించిన `విలన్` (2010), `ఐ` (2015) వంటి చిత్రాలకు బాణీలు కట్టారు స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు కూడా వరుస నెలల్లో తెరపైకి రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం `కోబ్రా`. ఇందులో `కేజీఎఫ్` భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, కె.ఎస్. రవికుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆగస్టు 11న జనం ముందుకు రాబోతోంది. తెలుగులోనూ ఈ చిత్రం అనువాద రూపంలో సందడి చేయనుంది. మరోవైపు.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో విక్రమ్ నటించిన సినిమా `పొన్నియన్ సెల్వన్ః 1`.. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధమైంది. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, కార్తి, జయం రవి, త్రిష ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మరి.. వరుస నెలల్లో వస్తున్న ఈ చిత్రాలతో విక్రమ్ - రెహమన్ కాంబో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Also Read