ఆలియాకి అతిథులుగా జాన్వి, అనన్య, సారా!?
on Jun 14, 2022
`గల్లీ బాయ్` (2019) వంటి ఘనవిజయం తరువాత బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ మరోమారు జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని` పేరుతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ వంటి మేటి తారలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే, ఇదే చిత్రంలో ముగ్గురు యువ కథానాయికలు కాసేపు కనువిందు చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ`లో కథానుసారం ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఆ పాటలో జాన్వీ కపూర్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్ అతిథులుగా మెరవనున్నారట. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి ఓ ఎస్సెట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ`లో జాన్వి, అనన్య, సారా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రీతమ్ స్వరాలు సమకూర్చుతున్న `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని`కి మనుష్ నందన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 2023 ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Also Read