ENGLISH | TELUGU  

మన బలాన్ని మనం కోల్పోతున్నాం..అసలు లెక్క ఎంత 

on Feb 25, 2025

తారుఖ్ రైనా,,నిఖితా దుత్త  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ 'ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్(The Waking of a nation)1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కుతుండగా రామ్ మద్వని(Ram Madhvani)రచనా దర్శకత్వ బాధ్యలతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచిట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ చూస్తున్నంత సేపు ఇంతవరకు జలియన్ వాలా బాగ్ కి సంబంధించి ఎవరకి తెలియని నిజాలని చెప్తున్నట్టుగా ఈ సిరీస్ తెరకెక్కించారేమో అనిపిస్తుంది.1913 నాటి మనుషుల వేషధారణ, ప్రవర్తన ఎలా ఉండేదో కూడా ఈ సిరీస్ లో చూపించబోతున్నారని కూడా అర్ధమవుతుంది.సిరీస్ లోని ప్రధాన క్యారక్టర్ చెప్పే డైలాగ్ 'ఇండియాలోని మన సామ్రాజ్యం కుప్పకూలిపోయింది.బ్రిటిష్ ప్రభుత్వమే  జలియన్ వాలా బాగ్ ని మొదలు పెట్టింది.భారతీయులమైన మనం మన బలాన్ని కోల్పోతున్నాం' వంటి సంభాషణలు ఈ సిరీస్ యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాయి.మార్చి 7 నుంచి సోనీ లైవ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

జలియన్ వాలాబాగ్(Jallianwala Bagh)అనేది అమృత్‌సర్(Amrithsar)పట్టణంలో ఒక తోట.1919 ఏప్రిల్ 13 న ఎటువంటి ఆయుధాలు లేకుండా పురుషులు,మహిళలు,పసి పిల్లలు సమావేశమయ్యి భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి చర్చలు జరుపుతున్నారు.జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిషు సైనికులు సమావేశమైన వారిపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.పది నిమిషాలపాటు సాగిన ఈ కాల్పులలో 1650 రౌండ్లు ఫైరింగ్ జరగగా,బ్రిటిష్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ 1000 మందికి పైగా మరణించారని  2000 మందికి పైగా గాయపడ్డారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. 

 

 


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.