మద్యం దుకాణాల లాటరీ వేడుక!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ వేడుక జరుగుతోంది. ప్రతి జిల్లాలో లాటరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. లాటరీ తీసి దుకాణదారులను ఎంపిక చేసే కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతోంది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు లాటరీలో తమ పేరు రావాలని కోరుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలలో లాటరీలు తీస్తున్నారు. లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులను ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే నేరుగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కూడా కల్పించారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులు లాటరీ జరిగే ప్రదేశానికి వచ్చారు. అయితే కొంతమంది దరఖాస్తుదారులు రాలేదు. వారి ప్రతినిధులు వచ్చారు. దరఖాస్తుదారుడు స్వయంగా రాకపోయినా పర్లేదని అధికారులు చెబుతున్నారు. లాటరీలో షాపు కేటాయించిన దరఖాస్తుదారులకు అధికారులే స్వయంగా ఫోన్ చేసి సమాచారాన్ని అందిస్తున్నారు. మచిలీపట్నంలో రెండు వైన్ షాపులను ఇతర రాష్ట్రాలకు చెందినవారు దక్కించుకున్నారు. మచిలీపట్నంలోని 1వ నంబర్ షాపును కర్నాటకకు చెందిన మహేష్ ఎ. బాతే‌కి దక్కింది. 2వ నంబర్ షాపు ఉత్తరప్రదేశ్‌కి చెందిన లోకేష్ చంద్‌కి దక్కింది.