ప్రధాన నిందితుడు లొంగిపోయాడు..!

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం ఏర్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో ఈయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పానుగంటి చైతన్య అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నాలుగు నెలలపాటు పోలీసులతో దోబూచులాట ఆడి, ఎట్టకేలకు లొంగిపోయాడు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి చైతన్య ప్రధాన అనుచరుడు.