చలిగా వుందని కుంపటి వెలిగిస్తే...

 

చలిగా వుందని వెచ్చదనం కోసం ఇంట్లో కుంపటి వెలిగిస్తే, ముగ్గురు సభ్యులున్న ఆ కుటుంబమే చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివసించే ముఖేష్ అనే వ్యక్తి శనివారం రాత్రి ఇంట్లో బొగ్గుల కుంపటి వెలిగించాడు. తలుపులు మూసి కుటుంబం మొత్తం నిద్రపోయింది. అయితే ఆ ఇంట్లోంచి పొగలు వస్తూ వుండటం గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు కొట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్ళారు. లోపల ముఖేష్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఊపిరాడక మరణించి వున్నారు. ఇంటిని వెచ్చగా చేసేందుకు ముఖేష్ అప్పుడప్పుడు కుంపటి వెలిగించేవాడని తెలుస్తోంది. ఇప్పుడు ఆ కుంపటే కుటుంబం ప్రాణాలు తీసింది.