స్టేడియంలో ఘర్షణ... 25 మంది మృతి

 

ఫుట్‌బాల్ స్టేడియంలో ఘర్షణ జరగడంలో 25 మరణించారు. 35 మంది గాయపడ్డారు. ఈజిప్ట్లోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్‌పీపీఐ మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఫుట్‌బాల్ ప్రేక్షకులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. కొంతమంది ప్రేక్షకులు టిక్కెట్ లేకుండా స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పుడు భద్రతా సిబ్బంది వాళ్ళని ఆపారు. వాళ్ళు ఘర్షణకు దిగారు. దాంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొంతమంది మరణించగా, తొక్కిసలాట కారణంగా మరికొందరు మరణించారు. ఘర్షణల నేపథ్యంలో కొంతమంది స్టేడియంలో ఉన్న వాహనాలకు నిప్పంటించారు. స్టేడియంలోని సామగ్రిని ధ్వంసం చేశారు.