కాసేపట్లో పెళ్ళి... ఆత్మహత్య

 

మరో రెండు గంటల్లో పెళ్ళి జరగబోతోంది. పెళ్ళి ఏర్పాట్లు తాను కోరుకున్నట్టుగా జరగడం లేదని పెళ్ళికొడుకు ఫీలయ్యాడు. దాంతో గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములాయపాడు గ్రామానికి చెందిన ఏసుబాబు అనే యువకుడి వివాహం తన అక్క కూతురితో ఖాయమైంది. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు పెళ్ళి ముహూర్తం. అయితే పెళ్ళి ఏర్పాట్లు చాలా సాధారణంగా వున్నాయని ఏసుబాబు ఆదివారం ఉదయం నుంచి ఫీలవుతున్నాడు. ఒకరిద్దరితో తన బాధను చెప్పుకున్నాడు. మీ అక్కవాళ్ళే కదా సర్దుకో అని వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ చాలా తక్కువ స్థాయిలో తన పెళ్ళి జరుగుతోందని, ఇది తన ఫ్రెండ్స్ ముందు తన పరువు తీస్తుందని ఏసుబాబు బాధపడ్డాడు. కాసేపు బాధపడినా సర్దుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. అయితే ఇలా ఎవరూ ఊహించని విధంగా ఏసుబాబు ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాకయ్యారు.