మరో ఓటీటీలోకి టెనెంట్ మూవీ...

సత్యం రాజేశ్.. ప్రస్తుతం అందరికి సుపరిచితమే. ఎందుకంటే కరోనా టైమ్ లో ఓటీటీలో వచ్చిన 'పొలిమేర' సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితం 'పొలిమేర-2'లో సత్యం రాజేశ్ నటనని థియేటర్లలో చూసిన జనాలు ఆశ్చర్యపోయారు.

మొదటగా 'సత్యం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్ లో చేశాడు. ఇక పొలిమేర సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మార్కులు కొట్టేశాడు. ఇక రీసెంట్ గా 'టెనెంట్' (Tenant) అనే సినిమాలో చేయగా అది థియేటర్లలో విడుదలైంది. అయితే దానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తో తెరకెక్కించిన ఈ సినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత జూన్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఓటీటీకి వచ్చేందుకు ఈ మూవీ సిద్ధమైంది.

అయితే ఇప్పుడు ఈ మూవీ జూన్ 28 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ మూవీని ఆహాలో చూసేయ్యండి.

వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ' టెనెంట్ ' మూవీని ఎమ్. చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా చేశాడు. ఇందులో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ తదితరులు నటించారు.