పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ

ఇటీవల దివంగతులైన మీడియా, సినీ, వ్యాపార దిగ్గజం పద్మవిభూషణ్  రామోజీరావు సంస్మరణ సభ హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మురళీమోహన్, డాక్టర్ సోమరాజు, శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు, ఈనాడు చీఫ్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ అభ్యున్నతి కోసం రామోజీరావు చేసిన అవిశ్రాంత కృషిని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుని, రామోజీరావు స్మృతికి నివాళులు అర్పించారు.