టీ20 విశ్వవిజేత ఇండియా!

టీ20 వరల్డ్ కప్‌ను టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో బ్రిడ్జ్.టౌన్‌లో జరిగిన ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో గెలిచి ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఫైనల్లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రియా జట్టు 169 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. క్లాసెన్ (52), డికాక్ (39), స్టబ్స్ (31) పరుగులు చేశారు. ఇండియా బౌలర్లు హార్దిక్ 3 వికెట్లు, అర్ష్.దీప్ 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, అక్షర్ 1 వికెట్ తీశారు.