ఆ భయంతోనే లగడపాటి వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ వస్తుందనే భయంతోనే తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు జరుగుతాయని లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో పస లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన లగడపాటి రాజగోపాల్‌కు సూచించారు. హైదరాబాదులో తెలంగాణవాదం బలంగా ఉందని వంటూ వార్పూ కార్యక్రమం ద్వారా తేలిపోయిందని ఆయన అన్నారు.