ఢిల్లీలో రేవంత్ బిజిబిజీ

కాంగ్రెస్ బిజెపి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేధాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పెద్దలను వరుసగా కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ    పర్యటనలో సీఎం రేవంత్​ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు దిల్లీలో పర్యటిస్తున్న రేవంత్​ కేంద్రమంత్రి అమిత్​ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం వెంట అమిత్​ షా వద్దకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే విభజన హామీలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో సీఎం రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు తెలిసింది.ఢిల్లీ పర్యటనలో ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయ‌న వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే విభజన హామీలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.