ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు టెక్కీలు దుర్మరణం...

 

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందిన ఘటన పూణె-అహ్మద్ నగర్ హైవేపై చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అహ్మద్ నగర్ లో జరిగిన స్నేహితుడి వివాహానికిగాను పూణెకు చెందిన 13 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు  ఓ మినీ బస్సులో వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పూణెకు నలభై కిలోమీటర్ల దూరంలో వారు వస్తున్న వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్సపొందతూ మరో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్యాంకర్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu