నాన్నకి న్యూడ్‌ ఫోటోలు పంపిన ప్రేయసి.. రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్!

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌పై అతని మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్‌ గురించి డిస్కషన్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ దానికి వివరణ ఇచ్చేందుకు మీడియాతో సమావేశమయ్యారు. 

‘గతంలో లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవం. కానీ, ఆమె చెప్తున్నట్టు మా మధ్య 11 ఏళ్ళుగా సంబంధం లేదు. ఏడేళ్ళుగా ఆమెకు దూరంగా ఉంటున్నాను. 2014 నుంచి 2017 వరకు మాత్రమే మేం రిలేషన్‌లో ఉన్నాం. ఆమెకి డ్రగ్స్‌ అలవాటు ఉండడం, ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కూడా అంత మంచిది కాకపోవడంవల్లే ఆమెకు దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా రిలీజ్‌కి బాగా దగ్గరకి వచ్చేసింది. అందుకే అందులో హీరోయిన్‌గా నటించిన మాల్వీతో నాకు సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తోంది. నేను దూరంగా ఉంటున్నానన్న కోపంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు, తనకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే మీడియాలో రచ్చ చేస్తానని బెదిరిస్తోంది. నాకు ఉన్న పేరు చెడిపోతుందనే భయంతోనే నేను ఇన్నాళ్ళూ సైలెంట్‌గా ఉన్నాను. ఒక అమ్మాయి న్యూడ్‌ ఫోటోలు వాళ్ళ నాన్నకి పంపించి బ్లాక్‌మెయిల్‌ కూడా చేసింది.  ఇలాంటి పనులు భరించలేకే ఆమెకు దూరంగా ఉంటున్నాను. నాకు మందు, సిగరెట్‌ వంటి అలవాట్లు ఉన్నాయి కానీ ఎప్పుడూ డ్రగ్స్‌ జోలికి వెళ్ళలేదు. 

నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో లావణ్య నాకు పరిచయమైంది. చాలా విషయాల్లో నాకు హెల్ప్‌ చేసింది. అందుకే ఆమె చేసినవన్నీ భరించాను. మస్తాన్‌ సాయి అనే అబ్బాయితో రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చేసింది. నా విల్లాలో నేను కింద ఉంటే వాళ్ళిద్దరూ పైన వుండేవారు. ఒకసారి మస్తాన్‌ ఆమెపై దాడి చేశాడు. అప్పుడతనిపై కేసు పెట్టింది. దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఆమె డ్రగ్స్‌ కేసులో ఉందని తెలిసిన వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత కూడా ఆమెకు చాలా సార్లు డబ్బులు ఇచ్చాను. ఈమధ్య ఇవ్వడం మానేశాను. దాంతో ఇలా కంప్లయింట్‌ చేసిందని అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను కూడా లీగల్‌గానే ప్రొసీడ్‌ అవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీడియా ముందుకు వచ్చి నేనే చెబుతాను. అంతేకాదు, ఒక లీగల్‌ ఎడ్వయిజర్‌ సమక్షంలోనే నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు అందరి సపోర్ట్‌ ఉంటుందని అనుకుంటున్నాను’ అన్నారు.