ఆ న్యూస్ నమ్మొద్దు.. పవన్ కళ్యాణ్ మాతో చెప్పింది ఇదే...

నార్త్ ఇండియాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా టికెట్ ధరలను భారీగా పెంచుకోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారని.. ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ చెప్పినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ తాజాగా అశ్వనీదత్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.

"ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూ లో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలకు వస్తున్నాయి. "సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని, కూలంకుషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవొచ్చు, అది ఒక వారమా? 10 రోజులా ? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి CBN గారు, తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు" అని అశ్వనీదత్ తెలిపారు.