మిస్డ్ కాల్ ప్రాణం తీసింది

 

జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామానికి చెందిన నందన అనే పాతికేళ్ళ యువకుడు తన ఇంటి దగ్గర్లోనే ఉండే ఒక యువతికి మిస్డ్ కాల్ ఇచ్చాడు. ఆ యువకుడు మిస్డ్ కాల్ ఇచ్చిన యువతి ‘మిస్’ కాదు. మరొకరికి మిసెస్. నందన ఇచ్చిన మిస్డ్ కాల్‌కి స్పందించిన ఆ యువతి అతనికి తిరిగి ఫోన్ చేసింది. అలా ఇద్దరి మధ్య మాటలు పెరిగి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారం ఆ యువతి భర్త దృష్టికి వచ్చింది. దాంతో ఆ యువతి భర్త నందనని పిలిచి ఈ వ్యవహారం నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఫోన్‌లో మాట్లాడిన మాటలన్నీ తాను రికార్డ్ చేశానని, వాటిని పోలీసులకు ఇచ్చి కేసు పెడతానని బెదిరించాడు. దాంతో అవమానంగా భావించడంతోపాటు భయపడిన నందన గ్రామం సమీపంలోని అడవిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu