రిషీకేశ్ లో విరుష్క దంపతులు

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు ఏమాత్రం తీరికి దొరికినా వీరు ఇలాఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు వెళుతుంటారు.  ఇటీవలే వీరు బృందావనంలో దర్శనానికి వెళ్లి వచ్చిన సంగతి విదితమే.  తాజాగా వీరు రిషికేశ్ లోని ఆశ్రమంలో పూజలు చేసి, ప్రసాదాలు  పంచారు.

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ముందు విరాట్ ఇలా తన సతీమణితో కలిసి ఆధ్మాత్మిక యాత్రకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

రిషికేశ్ లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో ఈ దంపతులు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలకమైన ఆస్ట్రేలియా టూర్ కు ముందు విరాట్ కోహ్లీ తన సతీమణితో కలిసి ఆధ్మాత్మిక యాత్రకు వెళ్లడం, ఆందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడం విశేషాలు. రిషీకేశ్ లో విరుష్క జంట యాత్రకు సంబంధించి ఫొటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.