భారత్ లో ఎన్నో దాడులు చేశాం...

 

భారత్ పై ఎన్నో దాడులు చేశాం.. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్  సయెద్‌ సలావుద్దీన్‌. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సయెద్‌ సలావుద్దీన్‌ అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో  ఓ పాక్‌ టీవీ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  భారత గడ్డపై తాను ఉగ్రవాద దాడులు జరిపిన విషయం నిజమేనని బాహాటంగా అంగీకరించాడు. అంతేకాదు తనకు, తన సంస్థకు భారత్‌లో పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారని చెప్పాడు. తమకు కావాల్సిన ఆయుధాలను అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసినట్టు సలావుద్దీన్‌ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu