వైకాపా ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి అరెస్ట్ కు హైకోర్టు నో!

 

ఈనెల 10వ తేదీన విశాఖ ఏజన్సీ ప్రాంతంలోని చింతపల్లి వద్ద వైకాపా అధ్యక్షుడు జగన్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో, పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. అందుకు ఆమెపై పాడేరు, చింతపల్లి, అరుకు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆమె శ్రీరామ్ అనే న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతో తనపై అన్యాయంగా మోపబడిన కేసులను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్ ద్వారా హైకోర్టుని కోరారు. కానీ కోర్టు ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. అయితే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే మంజూరు చేయడంతో ఆమెకు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు తమ దర్యాప్తుని కొనసాగించదానికి హైకోర్టు అనుమతించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu