ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ కి నేడు శంఖుస్థాపన

 

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నిర్మించబోతున్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్)కి నేడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, అశోక్ గజపతి రాజు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు, తెదేపా, బీజేపీల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శంఖుస్థాపన కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడే ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu