అసెంబ్లీ.. రోజా సస్పెన్షన్ పై గందరగోళం


ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రోజా సస్పెన్షన్ పై సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి.  నిన్న స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరంపాటు సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన చేపట్టారు. వైకాపా అధినేత జగన్ మాట్లాడుతూ రోజాను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు.. సభలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. లేని అధికారాన్ని దుర్వినియోగపరిచారు.. ఏడాది పాటు సస్పెండ్ చేయడం చట్ట విరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu