కర్ణాటక సిఎం కోసం ఢిల్లీలో కసరత్తు

 కర్ణాటకలో  సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కర్నాటక ముఖ్యమంత్రి పదవిని చెరో రెండేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనను తాను తిరస్కరించినట్ల చెప్పిన డీకే శివకుమార్ ఇదేమీ ఆస్తుల పంపకం లాంటిది కాదన్నారు.  తాను సీఎం రేసులో ఉన్నానని స్పష్టం చేశారు.