తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

గురువారం (ఫిబ్రవరి 22) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 69 వేల 191 మంది దర్శించుకున్నారు.

వారిలో 22 వేల 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 60లక్షల రూపాయలు వచ్చింది.