మహిళలు కత్తులతో వెళ్లొచ్చు

ఢిల్లీలో నడిరోడ్ల మీదే కాకుండా బస్సులు చివరకు రైళ్లలో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మొన్నామధ్య మహిళల బోగీలో ప్రయాణిస్తున్న ఒక యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె వద్ద ఉన్న నగదు, నగలు దోచుకుని దర్జాగా వెళ్లిపోయారు..అంతేకాకుండా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే మహిళల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇవి నానాటికీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ మెట్రో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే మహిళలు తమవెంట చిన్న చిన్న కత్తులు, లైటర్స్, అగ్గిపెట్టె, పెప్పర్ స్ప్రే లాంటివి తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu