కోడిపందాలపై సుప్రీంలో విచారణ

ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించే కోడి పందాల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిషేధం విధించడంతో పందెం రాయుళ్లు సుప్రీంను ఆశ్రయించారు. ఇవాళ వారు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల్లోని నాలుగో అంశంపై స్టే విధించింది. అలాగే కోళ్లను నిర్భందించి ఉంచడం అభ్యంతరకరమని...కోళ్లకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని.. కానీ కోళ్లను మాత్రం సీజ్ చేయొద్దని  పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వస్తున్నట్లు ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu